విశాలాంధ్రబ్యూరో -నెల్లూరు: నెల్లూరు నగర ఏఐటీయూసీఅధ్యక్షులు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగస్తులుగా సుదీర్ఘకాలం బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమస్యలపై పోరాటంచేసినటువంటి వ్యక్తిఉద్యోగవిరమణతరువాతఏఐటీయూసీనగరఅధ్యక్షులుగాజిల్లాఉపాధ్యక్షులుగాఆయనసుదీర్ఘకాలంపనిచేశారుమురళీధర్కిభార్య,ఒకకుమారుడు ముగ్గురు కుమార్తెలుఉన్నారు.గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూఇంటికెపరిమితమైనారు ఆదివారంరాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా రాత్రి 12.20గంటలకుమృతిచెందారు.ఆయనఅంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్
శ్రీరామ్ నగర్ లోని వారి స్వగృహం నందు జరుగుదని కుటుంబ సభ్యులు తెలియజేశారు.మురళీధర్రావుమృతికి పలువురి సంతాపం:- మురళీధర్ రావు మృతి భారత్ కమ్యూనిస్టు పార్టీ ఏఐటియుసికి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘానికితీరని లోటు అని సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య నగర కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి ఏఐటీయుసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిలాని ఖాన్, శంకర్ కిషోర్, సిపిఐ సీనియర్ నాయకులు వి రామరాజు, రైతు సంఘం నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు కే ఆంజనేయులు, పలువురు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తమప్రగాఢసంతాపాన్నితెలియజేశారు.