జై శ్రీరామ్ నినాదంతో హోరెత్తిన పురవీధులు
సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామ రథం ఊరేగింపు
విశాలాంధ్ర -తనకల్లు : 500 సంవత్సరాల తరువాత ఎందరో మహా పురుషుల బలి దానాలoతరo శ్రీరామ జన్మభూమి అయోధ్యలో బాలా రామచంద్ర మూర్తి ప్రతిష్టాపన సందర్భంగా తనకల్లు మండలంలోని ప్రతి గ్రామంలోపండుగ వాతావరణo సంతరించుకుoది. స్థానిక శ్రీరామ దేవాలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బ్యాంకు వీధిలో రామాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీరామచంద్రమూర్తి రథం ఊరేగింపు కార్యక్రమం భాణ సంచాలతో, కోలాటాలు డప్పులతో జైశ్రీరామ్ నినాదాలతో పురవీధుల గుండా సాగింది. భక్తులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకొని ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ రామ లక్ష్మణ వేషధారణలతో ఉన్న చిన్నారులు అందరినీ ఆకట్టుకొని అలరించారు. సత్యనారాయణ గుప్తా, ఆనంద్,అనిల్,అభిలాష్, రామాంజులశెట్టి,సురేష్ గుప్తా నాగేంద్ర గోపాల్ సతీష్ వెంకటేష్ మధుసూదన గుప్తా భాస్కర్ దేశాయ్ గణేష్ రెడ్డి కరుణాకర్ రెడ్డి బాల్ రెడ్డి పోస్టల్ శ్రీరాములు అమర కార్తికేయ దామోదర ప్రకాష్ హరి జగదీష్ వెంకటేష్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.