విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) కర్ణాటక రాష్ట్రం ధార్వాడలోని కర్ణాటక యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు కర్ణాటక ప్రభుత్వం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగే జాతీయ సమైక్యత శిబిరానికి ధర్మవరంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి ముళ్లపాటి సాకే ఉదయ్ కిరణ్ (బిఎ. మూడవ సంవత్సరం) ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్.కె.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎంపిక పత్రాన్ని విద్యార్థికి అందజేశారు. సాకే ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ఈ అవకాశం లభించడం నాకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. జాతీయ సమైక్యత శిబిరంలో మన రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ఇతర రాష్ట్రాల విద్యార్థుల ముందు ప్రదర్శించే అవకాశాలు రావడం జరిగిందన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం ఉదయ్ కిరణ్ ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గోపాల్ నాయక్,వైస్ ప్రిన్సిపాల్ త్రివేణి, అధ్యాపకులు షమీముల్లా, చిట్టెమ్మ, కిరణ్ కుమార్, పావని, భువనేశ్వరి, పుష్పావతి, సౌజన్య, సరస్వతి, స్వామి హేమావతి, అధ్యాపకేతర సిబ్బంది, తోటి విద్యార్థులు పాల్గొన్నారు.