అఖిల భారత యువజన సమైక్య డిమాండ్
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తావని
నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఎక్సైజ్ సూపర్డెంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టంట్ బాల కృష్ణకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ… అధికారంలోకి రాకముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని వాగ్దానాలు చేసి రాష్ట్రంలో మద్యాన్ని ఏర్లే పారిస్తూ విపరీతమైన రేట్లు పెంచేస్తూ ఆదాయమే పరవావదిగా ఆశ్సిరకం మధ్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చలగటం ఆడుతున్నారు అని పేర్కొన్నారు. నంతపురం జిల్లా వ్యాపితంగా పలు నియోజకవర్గాలు మండలాలలో ఉన్నటువంటి మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్లోసింగ్ టైం అయిపోయిన తర్వాత షాపుల షట్టర్లను క్లోజ్ చేసి దొడ్డిదారిన తెల్లవారుజామున 5 గంటల వరకు బ్లాక్ లో మద్యం విక్రయాలు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా మద్యం విచ్చలవిడిగా హైవే లో ఉన్న ఫ్యామిలీ రెస్టారెంట్, దాబా లో దొరుకుతున్నది అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సూచనలను పరిగణ లోకి తీసుకోకుండా పాఠశాలలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, కోచింగ్ సెంటర్లు, జనావాసాల మధ్య మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం వలన విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రజలకు తీవ్ర అ సౌకర్యం కలుగుతోందన్నారు.
కావున తమరు తక్షణమే ప్రజా ప్రయోజనాల రిత్యా జనావాసాల మధ్యన ఉన్నటువంటి మద్యం షాపులు బార్ అండ్ రెస్టారెంట్లను నగరం పట్టణ కేంద్రాలకు దూరంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆనంద్ కుమార్, నగర కార్యదర్శి మోహన్ కృష్ణ, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి ధనుజయ , నగర అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గన్నారు.