కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్న తెదేపా శ్రేణులు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – రాబోవు సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని తెదేపా చింతపల్లి మండల నాయకులు అన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ (41) వ జన్మదిన వేడుకలను మంగళవారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు టెంట్ హౌస్ వద్ద ఏర్పాటుచేసిన లోకేష్ జన్మదిన వేడుకల కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు పెదిరెడ్ల బేతాళుడు, అరకు పార్లమెంటు బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణంలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తెదేపా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. నారా లోకేష్ ను ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యకర్త సైనికునిలా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. యువగళం పాదయాత్రతో ప్రజల మన్ననలు పొందిన గొప్ప యువ నాయకుడు లోకేష్ అన్నారు. ఆయన నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని వర్గాల ప్రజలు, యువకులు రాజకీయాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గొల్లూరి మంగు, మొట్టడం వెంకటరమణ, బేతా నాగు, మర్రి మంగ్లు, వంతల గణపతి, చిందాడ చిన్న, గోవింద్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.