విశాలాంధ్ర, ఎన్ పి కుంట: మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో తెదేపా నాయకులు మాజీ మంత్రివర్యులు పరిటాల రవీంద్ర. (19) వర్ధంతిని పురస్కరించుకొని చంద్రశేఖర్ ఏపిఎం బుధవారం పరిటాల చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బస్టాండ్ కూడలిలో పరిటాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న సమయంలో పరిటాల హత్యకు గురి కావడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పరిటాల కృషి చేశారని అదేవిధంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు తెదేపా ప్రధాన కార్యదర్శి వంకమద్ది నరసింహులు, మద్దేపల్లి రవి ,దండోరా రెడ్డప్ప, తెదేపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.