విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్యసాయి జిల్లా) వ్యవస్థనే మార్చుకునే వెలుగు చుక్క ఓటు హక్కు అని, ఓటును సద్వినియోగం చేసుకున్నప్పుడే మంచి పరిపాలన కలుగుతుందని ఆర్డీవో రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఓటర్ల దినోత్సవం సందర్భంగా వారు పట్టణంలోని సాయి నగర్లో గల శ్రీ సీతారామయ్య ఇంటర్ కళాశాల విద్యార్థులతో పాటు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సాయి నగర్ నుండి కాలేజీ సర్కిల్ వరకు ఓటు నినాదాలతో మారుమోగుతూ మానవహారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం ఆర్డీవో మున్సిపల్ కమిషనర్లు మాట్లాడుతూ ఓటు హక్కు యొక్క విలువ, వాటి ప్రయోజనాలు గూర్చి పలు విషయాలను విద్యార్థులకు తెలియజేశారు. ఓటు హక్కుతో మంచి సమాజాన్ని మంచి పరిపాలనను కొనసాగించుకునే అవకాశం ఉందని తెలిపారు. నేటి యువతీ యువకులు ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతపై వాటి ప్రయోజనాలపై కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత మీపై ఉందని తెలిపారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు అర్హులని తెలిపారు. ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ఆ ఓటు విలువను వినియోగించుకున్న నాడు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని తెలిపారు. అర్హులైన ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యము అని తెలిపారు. అదేవిధంగా అర్హులైన ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన పండుగ రోజు అని తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయమును ఇద్దరు సిటిజన్లను వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఏవో కత్తి జున్ కుప్రా, టిపిఓ సాయి ప్రసాద్, శివ ప్రసాద్, ఎంపీడీవో సూపర్డెంట్ నబి రసూల్, శ్రీ సీతారామయ్య కళాశాల కర్రీస్పాండెంట్ సీతారామయ్య,తాసిల్దార్ సిబ్బంది, మున్సిపల్, సచివాలయ కార్యాలయ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.