ట్రైకార్ డైరెక్టర్ లోవరాజు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఎందరో త్యాగదనుల ఉద్యమ ఫలితంగా వచ్చిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి ఏటా జనవరి 26న జరుపుకోవడం సంతోషకరమైన విషయమని వైకాపా టైకార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మండలంలోని తాజంగి పంచాయతీ రాజేంద్రపాలెం జిపిఎస్ టి డబ్ల్యూ పాఠశాలలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు రామకృష్ణ, స్వప్న సుందరిలతో కలసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన పతాకావిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవ ప్రాసస్యాన్ని విద్యార్థులకు వివరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ దేశంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులకు ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనారిటీ లకు ప్రస్తుత ప్రభుత్వాలలో అత్యున్నతమైన పదవులు దక్కేందుకు అవకాశం కల్పించారన్నారు. ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులుగా తీర్చి దిద్దాలంటే గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు బాధ్యతగా చదువు నేర్పించాలన్నారు. ఆదివాసి ప్రాంతాలలో పోరాట యోధులు కొమరం భీమ్, బిర్ష ముండా, గాం గంటం దొర, మర్రి కామయ్య, మల్లు దొర, మాతే లక్ష్మయ్య పోరాటాల యోధుల స్ఫూర్తితో ఆదివాసి ప్రాంతంలో విద్యార్థి, యువత, మేధావులు,ప్రజలు,రాజకీయ నాయకులు, ఆదివాసుల హక్కులు, చట్టాలు కాపాడుకునే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.