విశాలాంధ్ర,పార్వతీపురం: గిరిజన సహకార సంస్థ ద్వారా ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని జి సి సి డివిజనల్ మేనేజర్ మహేంద్ర కుమార్, సిబ్బంది తెలిపారు.శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జి సి సి స్టాల్లను ఏర్పాటు చేసినవారు జిల్లా అధికారులకు,గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విచ్చేసిన వారందరికీ అవగాహన కల్పించారు. ఇదిలా ఉండగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ అధికారిగా జి సి సి డివిజనల్ మేనేజర్ మహేంద్ర కుమార్ ఐటిడిఏ పిఓ విష్ణు చరణ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని పొందారు. ఆయనను జి సి సి ఉద్యోగులు, సిబ్బంది కలసి అభినందించారు.