జాతీయ జెండా ను ఎగురవేసిన ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మెడికల్ కళాశాల ఆవరణం లో ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ విలువలను అనుసరిస్తూ గత 75 సంవత్సరాలుగా మన భారతదేశం సర్వ మానవ సౌభ్రాతృత్పదేశంగా, భిన్నత్వంలో ఏకత్వంతో అన్ని దేశాలకు ఆదర్శప్రాయంగా నిలవడం మన భారతదేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపదకు నిదర్శనమని, అంబేద్కర్,గారి రాజ్యాంగ నిర్మాణం ప్రకారం, సమానత్వాన్ని అన్నిచోట్ల కలిగి ఉంటే భారతరత్న అంబేద్కర్ కల సత్కారం అవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా సుమారు 110 మంది వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రిన్సిపల్ ఆఫీస్ స్టాఫ్, ఎన్ ఎస్ ఎస్,స్పోర్ట్స్ లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు.
మెడికల్ కళాశాల ఆంధ్ర ప్రదేశ్ లోనే అత్యుత్తమమైన కళాశాలగా ఎదగడానికి ఇక్కడి సిబ్బంది కృషి చేస్తున్న తీరు అద్భుతం అని అన్నారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లు ఆచార్య శారోన్ సోనియా, నవీన్, ఆత్మారాం, సుబ్రమణ్యం, ప్రొఫెసర్లు డాక్టర్ రామస్వామి నాయక్, డాక్టర్ శంషాద్ బేగం, డాక్టర్ సంధ్య, డాక్టర్ సుచిత్ర సౌరి, డాక్టర్ భీమసేన ఆచార్, డాక్టర్ వేముల శ్రీనివాసులు, డాక్టర్ శివ శంకర్ నాయక్, డాక్టర్ ఎస్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ సరళ, డాక్టర్ రామస్వామి, డాక్టర్ నాగ శ్రీధర్ రావు, డాక్టర్ వాల్మీకి శ్రీనివాస్, హాస్టల్ వార్డెన్ లు డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ చంద్రశేఖర్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, ఫిజికల్ డైరెక్టర్ నరసింహ నాయక్, తదితరులు పాల్గొన్నారు.