విశాలాంధ్ర -పామిడి : 75వ గణతంత్ర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, పంచాయితీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి,పోలీస్ స్టేషన్, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మరియు విద్యా సంస్థలలో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా
తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సునీత బాయ్ మాట్లాడుతూ మండల ప్రజలందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రిటీష్ వాళ్లు మనదేశాన్ని 200 ఏళ్లు పాలించారు,ఆగష్టు 15, 1947 స్వాతంత్య్రం వచ్చింది, ఆ తర్వాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చైర్మన్ గా ఆగష్టు 29, 1947న రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది, నవంబరు 26, 1949న రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ అమోదం తెలిపింది, అప్పటి వరకూ బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారమే మన పాలన సాగేది, అయితే 1950 జనవరి 26 వ తేదీన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మన దేశానికి తొలి రాష్ట్రపతి అయ్యారు,ఆ రోజు 21 ఫిరంగులతో సెల్యూట్ను అందుకున్నారు,అలా మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే ఆ రోజునుంచి మన దేశాన్ని ప్రజాస్వామ్య, సర్వసత్తాక, గణతంత్రదేశంగా పిలుచుకుంటున్నాం తెలిపారు, ఈ కార్యక్రమంలో అని కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.