విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని గాంధీ నగర్ లోని ట్యాంక్ వద్ద జనవరి బాడీ సమావేశంలో మునిసిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగింది. తొలుత సమావేశాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా శ్రీ సత్యసాయి జిల్లా మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు వెంకటేష్, సిఐటియు ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్, ట్రాన్స్పోర్ట్ రంగం రాష్ట్ర నాయకులు రఫీ పాల్గొన్నారు. నూతన కమిటీలో గౌరవ సలహాదారులుగా చెన్నకేశవులు, రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రసాద్, అధ్యక్షులుగా బాబు, ఉపాధ్యక్షులుగా పెద్దక్క, ఓబులప్ప, ప్రధాన కార్యదర్శిగా ముకుంద, సహాయ కార్యదర్శిగా చంద్రశేఖర్, కోశాధికారిగా లక్ష్మీ ఓబులేశును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తదుపరి ఇటీవలే విధి నిర్వహణలో మృతి చెందిన ఔట్సోర్సింగ్ కార్మికులు గూడూరు బాబు కుటుంబానికి రూ.37,800 నగదును, అదేవిధంగా మరో కార్మికుడు క్యాన్సర్కు గురై న డి. నాగేంద్రకు రూ.6,500 మొత్తము కలిపి రూ.44,300 లను ఆర్థిక సహాయంగా కుటుంబ సభ్యులకు సిఐటియు నాయకులు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మవరం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల అధ్యక్ష, కార్యదర్శులు బాబు, ముకుంద, చెన్నకేశవులు, పెద్దక్క, ఓబులప్ప, అత్యధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.