విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శనివారం ఎలక్ట్రీషియన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు దేవి రెడ్డి సురేంద్ర, కార్యదర్శి దేవి రెడ్డి రాజు మాట్లాడుతూ ఐక్యమత్తంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకొనవచ్చునని వారు పిలుపునిచ్చారు. తొలుత థామస్ అల్వాస్ ఎడిషన్ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి బైక్ ర్యాలీతో పట్టణంలోని చెన్నకేశవపురం నుండి గాంధీనగర్ సర్కిల్ కు వెళ్లి జాతిపితకు పూలమాలలో పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి ముఖ్య అతిథులు, నాయకులు ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించుకున్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్ ను నిర్వర్తించుటకు 100 మంది కార్మికులు అంగీకరించారు. భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు అయినా సరే కలిసికట్టుగా ఉండి పోరాడుకోవాలని తీర్మానం చేశారు. తదుపరి న్యూ షా షా ఎలక్ట్రికల్ షాపు వారు, చెన్నం రెడ్డి వీరారెడ్డి సౌజన్యంతో భోజన సదుపాయాన్ని కల్పించారు. తదుపరి కార్మికులకు శ్రీ రాందేవ్ ఎలక్ట్రికల్ వారి సౌజన్యంతో ప్రోత్సాహక బహుమతులను కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప కార్యదర్శి లతీఫ్, కోశాధికారి మాసోల్ ఇస్మాయిల్, చెన్నం రెడ్డి వీరారెడ్డి ,సంకు శ్రీనివాస్, ఆంజనేయులు ,మూకా కృష్ణమూర్తి, ప్యాదిండి మహేష్ ప్యాదిండి మల్లికార్జున, జావిద్, షకీల్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.