జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన ఎంపీపీ అనూష దేవి
విశాలాంధ్ర – చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా) :- గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగనన్న పాలనలోనే సుసాధ్యం అయిందని ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 76 వ వర్ధంతి పురస్కరించుకుని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్ముని వర్ధంతి కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా మండల పరిషత్, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తో కలసి ఆమె మహత్మ గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైకాపా ప్రభుత్వంలో జగనన్న పరి పాలనలో సాకారం అయిందన్నారు. సచివాలయ, గ్రామ వాలంటీర్ వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే పరిపాలనను తీసుకువచ్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిదన్నారు. భారతీయులను భానిసలుగా చేసి వందల ఏళ్లు నియంతృత్వ పాలన చేసిన బ్రిటీష్ పాలకులపై నిరాయుదునిగా అహింసా మార్గంలో పోరాటం చేసి స్వాతంత్య్రాన్ని తెచ్చి పెట్టిన త్యాగశీలి జాతిపిత పూజ్య బాపూజీ మహాత్మ గాంధీ అన్నారు. ఆయన మరణించి 76 ఏళ్లు పూర్తి అయినా ఉద్యమం చేసి ఆయన అందించిన స్వాతంత్య్ర ఫలాలు మనం అనుభవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు దాసరి ధారలక్ష్మి, ఎర్ర బొమ్మల ఎంపీటీసీ సభ్యుడు సత్తిబాబు, మండల పరిషత్ ఇ ఓ పీ అర్ డీ యూ ఎస్ వీ శ్రీనివాస్, ఏ ఓ రవీంద్ర, పంచాయతీ కార్యదర్శులు కే శ్రీనివాస్, యస్ రాజేష్, గ్రామీణ నీటి పారుదల శాఖ ఏఈ గడుతూరి స్వర్ణలత, పంచాయతీ రాజ్ ఏ ఈ భాల కిషోర్, సిబ్బంది పాల్గొన్నారు.