విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : వచ్చే ఎన్నికల్లో మంత్రాలయ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరోమారు బాలనాగిరెడ్డి విజయం సాధిస్తారని వైసీపీ బీసీ సెల్ నాయకులు బోయ దస్తగిరి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పెద్దకడబూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విజయాన్ని టిడిపి, జనసేన కూటమి ఆపలేదన్నారు. నియోజకవర్గంలో ఏ కష్టమొచ్చినా ఏ ఆపదలో ఉన్నా రాజకీయాలకు అతీతంగా రాంపురం రెడ్డి సోదరులను ఆశ్రయిస్తే చాలు అక్కున చేర్చుకుంటారన్నారు. మంత్రాలయం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బాలనాగిరెడ్డికే దక్కుతుందని కొనియాడారు. దమ్ము ధైర్యం ఉంటే పొత్తు లేకుండా సింగిల్ గా పోటీ చేయాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలోని బోయ వాల్మీకులు అందరూ అండగా ఉండి మరోమారు బాలనాగిరెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.