విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని గుడ్ సెట్ కొట్టాలా (తోట దగ్గర) కు చెందిన పి అంకాలమ్మ (79) భర్త లేట్ పుల్లయ్య నాయుడు మృతి చెందగా, కుటుంబ సభ్యులు నేత్రదానం కొరకు విశ్వ దీప సేవా సంఘం వారికి సమాచారాన్ని అందించారు. తదుపరి విశ్వదేపా సేవా సంఘం వారు కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి వారి అంగీకారము సహకారముతో, జిల్లా అందత్వ నివారణ సంస్థ హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్ నాగరాజు నేత్రాలను సేకరించడం జరిగింది. తదుపరి నేత్రదానానికి సహకరించిన కుటుంబ సభ్యుల్లో కుమారుడు పివిఎన్. నాయుడు, తమ్ముడు ఆర్. నాయుడు, నగేష్ నాయుడు ఆదినారాయణకు విశ్వదీప సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాజుల సురేష్, ఉపాధ్యక్షులు టిసి. శేఖర్ రెడ్డి ,కార్యదర్శి దేవరకొండ చంద్రశేఖర్, ధనుంజయ, కేశవరెడ్డి, జూజారు రఘు సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.