విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని అంగవైకల్యం గల ఒక మహిళకు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఒక కాలును వైద్యులు తొలగించారు. దీంతో ఆ మహిళకు జీవనం ప్రశ్నార్థకంగా మారడంతో, స్థానికులు తారక్ చేయూత ట్రస్ట్ కు సమాచారాన్ని అందించారు. తదుపరి తారక్ చేయుట ట్రస్ట్ అధ్యక్షుడు రామాంజనేయులు అక్కడికి చేరుకొని నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం బాధితురాలు తనకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.