విశాలాంధ్ర ధర్మవరం:; ఇటీవల ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలలో కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు కబాడీ పోటీల్లో ప్రతిభను ఘనపరిచి విజయం సాధించడం జరిగిందని పాఠశాల హెచ్ఎం మేరీ వర కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఆటల పోటీలలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మా విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలపడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా కప్పు ,గోల్డ్ మెడల్స్,, యోగ్యత పత్రాలను అందుకున్నారని తెలిపారు. ఈ ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలలో ప్రతిభ ఘనపరిచిన పాఠశాలలోని విద్యార్థినీలకు పాఠశాల ఉపాధ్యాయ బృందం రూ.35,000 లను నగదు బహుమతిగా వారు ప్రకటించారు. అనంతరం హెచ్ఎం మేరీ వర కుమారి తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల కమిటీ చైర్మన్ సభ్యులు తల్లిదండ్రులు ప్రతిభ కనపరిచిన విద్యార్థినీలకు కృతజ్ఞత అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.