ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర- ధర్మవరం:: రాబోయే కాలంలో ముస్లిం మైనారిటీలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వగృహం ఇంటి పక్కన గల పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనారిటీలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వము చేయని అభివృద్ధి పనులను ముస్లిముల కొరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అభివృద్ధిని చేసిందని వారు తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాలను కులాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలను అభివృద్ధి బాటలో తాను నడిపినందుకు నాకెంతో తృప్తి ఉందని తెలిపారు. ఏ ప్రభుత్వము చేయని అభివృద్ధి పనులను నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం అందరూ గర్వించదగ్గ విషయమని తెలుపుతూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈద్గాకు 20 ఎకరాలు ఇవ్వడం జరిగిందని, తాను షాదీ మహాల్ ఇవ్వడం జరిగిందని, రోడ్డును కూడా వేయడం జరిగిందన్నారు. అదేవిధంగా లోనీకోటలో ఉర్దూ స్కూల్ను ఉన్నత పాఠశాలగా ప్రమోట్ చేయడం జరిగిందని తెలిపారు. ఇమామ్, మౌజోన్లకు గతంలో 5000 ఇవ్వడం జరిగిందని నాడు పదివేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. ముస్లింల అభివృద్ధి పాటే నా ప్రధమ కర్తవ్యం అని తెలిపారు. ముస్లిముల సమస్యలను పరిష్కరించడంలో తాను నిరంతరము కృషి చేస్తూ, అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని 40 మసీదు ముత్వల్లీలు, కమిటీ సభ్యులు, ఇమామ్, మౌజన్లు, కౌన్సిలర్లు సరితాల భాష, జిలాన్, ఎస్పీ బాషా, కోఆప్షన్ నెంబర్ కరీం, మైనారిటీ నాయకులు చాంద్బాషా, సుభాన్ బాషా, ఏక్ బాల్, సాదిక్, అమీర్ భాష, ముస్లిం మైనారిటీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.