విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణంలోని బ్రాహ్మణ వీధి కోటా స్కూల్ వెనుక భాగానగల షిఫా హాస్పిటల్ లో ఈనెల మూడవ తేదీ శనివారం ఉచిత ఆర్తో ఎముకల వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు షిఫా హాస్పిటల్ అధినేత డాక్టర్ తాహిర్ అహ్మద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కీళ్లు అరిగిపోవడం, ఎముకలు వంకర పోవడం, కండరాలు పట్టుకోవడం, కీళ్లవాతం, రుమటాలజీ సమస్యలు, కండరాల నరాల బలహీనత, తిమ్మరీలు, కాళ్లు మంటలు, మోకాళ్లు, తుంటి మార్పిడి లకు మంచి వైద్య చికిత్సలను ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పెంచల ప్రదీప్ బట్టచే నిర్వహించబడునని తెలిపారు. అదేవిధంగా పిఆర్పి/మోకాళ్ళ నొప్పులకు ప్లాస్మా ఇంజక్షన్ కూడా ఇవ్వబడునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9059111313 కు సంప్రదించవచ్చునని తెలిపారు.