విశాలాంధ్ర, సీతానగరం: స్థానిక మండల పరిషత్ అభివృధ్ధి అధికారిగా ఎం. ఈశ్వరరావు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు దృష్ట్యా ఎంపిడిఒల బదిలీలు పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం ఎంపిడిఓగా పనిచేస్తున్న ఈశ్వరరావును విజయనగరం జిల్లాకు కేటాయించగా ఆయనకు జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజ్ కుమార్ సీతానగరం మండలంకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో ఈశ్వరరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.ఇంతవరకు ఇక్కడ ఎంపిడిఓగా పనిచేసిన ఎం ఎల్ ఎన్ ప్రసాద్ ఇకనుండి పరిపాలన అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్తగా ఎంపిడిఓగా జాయిన్ అయిన ఈశ్వరరావును ఏఒ ప్రసాద్, ఈఓపిఆర్డీ కుమార్ వర్మ, మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది, ఉపాథిహామీ పథకం కార్యలయం సిబ్బంది, సెక్రటరీలు,తదితరులు కలసి అభిందనలు తెలిపారు. కొత్తగా జాయిన్ అయిన ఎంపిడిఓ ఈశ్వరరావు ఎమ్మెల్యే జోగారావును, ఎంపిపి ప్రతినిది బలగ శ్రీరాములునాయుడు, జెడ్పీటీసీ బాబ్జి తదితరులను మర్యాద పూర్వకంగా కలిసారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ అందరి సహకారంతో మండల పరిషత్ అభివృధ్ధికి కృషిచేస్తానని ఎంపిడిఓ ఈశ్వరరావు చెప్పారు.