విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఢిల్లీ ఏపీ భవన్ వద్ద శుక్రవారం జరుగుతున్న ధర్నాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి తో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ధర్నాలు, ఆందోళనలు ఆందోళనలు జరపకుండా ఏపీ కాంగ్రెస్ నేతల ఏర్పాట్లను
అడ్డుకున్న ఏపీ భవన్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు
అనుమతి లేకుండా ధర్నా చేయడం కుదరదని వెల్లడి వెల్లడించారు. దీంతో
అధికారులతో ఏపీ కాంగ్రెస్ నేతల వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, సాధించి తీరుతామని సాధించేవరకు పోరాటం ఆగదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వెంట చోడవరం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి
కచ్చా శశి కుమార్, అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్ పాల్గొన్నారు.