ఆదర్శ పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ భాగ్య లక్ష్మమ్మ
విశాలాంధ్ర – ధర్మవరం : వృత్తి విద్య కోర్సులలో విద్యార్థులకు నైపుణ్యం ఎంతో అవసరమని ఆదర్శ పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ భాగ్య లక్ష్మమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వృత్తి విద్య కోర్సుల్లో భాగంగా టిఐ ఐ టి ఎస్ అండ్ అప్రూవల్ కోర్సులు నిర్వహిస్తున్నామని, శుక్రవారం ఇండస్ట్రియల్ విజిట్ కోసం స్థానిక సచివాలయమును సందర్శించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు సచివాలయాలలో ప్రజలకు సంక్షేమ పథకాలు తోపాటు ఆధార్ కార్డు సంబంధించినటువంటి వాటి ఉపయోగాలు చేసే పద్ధతిని కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల పట్ల విద్యార్థులు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వృత్తి విద్యా అధ్యాపకులు రంగనాథ్, చైతన్య లక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.