ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నామాల నాగార్జున
విశాలాంధ్ర – ధర్మవరం : ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా వికాస్ పరీక్షను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పరీక్ష పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం నామాల నాగార్జున మాట్లాడుతూ
త్వరలో పదవ తరగతి విద్యార్థులకు జరగబోయే పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని,విద్యార్థులకు అవగాహన రావడానికి పరీక్షలంటే భయం పోవడానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఈ నెల 4 తేదీన పట్టణంలోని శ్రీ వాసవి బాలికల జూనియర్ కళాశాలలో పదవ తరగతి నమూనా పరీక్ష నిర్వహిస్తున్నా మనీ తెలిపారు. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థి,విద్యార్థినీయులు అందరూ ఈ పరీక్షకు హాజరై జయప్రదం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కనుమ దామోదర్ నాయకులు మహేష్, సాయి పాల్గొన్నారు.