విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం సాయంత్రం అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బివి రమణ, బండి నాగరాజు, గౌరవ అధ్యక్షులు, కోశాధికారి దాసరి వెంకటేశులు (చిట్టి) సిరివెళ్ల రాధాకృష్ణ మామిళ్ళ అశ్వత్థ నారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి పల్లకి సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని వివిధ పూలలతో చక్కటి అలంకారాన్ని గావించి, అర్చకులు కమిటీ భక్తాదుల నడుమ వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో పల్లకి లో ఆశీనులు చేసి, ఊరేగించారు. అనంతరం మహిళలు శాంతి కల చౌడేశ్వరి దేవి పారాయణంతో పాటు, అమ్మవారి సంకీర్తనలు కూడా పాడారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వందలాదిమంది కుల బాంధవులు విచ్చేయడం జరుగుతుంది. తదుపరి తీర్థప్రసాదాలతో కార్యక్రమం ముగిసింది.