విశాలాంధ్ర – ధర్మవరం : తిరుపతి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఎర్రచందనం స్మగ్లర్ల చేసిన దాడిలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి గుట్ట కిందపల్లికి చెందిన బిల్లేగణేష్ అనే 14వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ మృతి చెందారు. విధులలో భాగంగా ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి వెళ్లిన వీరు వాహనాలను తనిఖీ చేస్తుండగా బిల్లే గణేష్ను ఎర్రచందనం స్మగ్లర్ వాహనం ఢీకొనడంతో మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. గుట్ట కింద పల్లి విషాద ఛాయలో మునిగిపోయింది. అతి చిన్న వయసులోనే ఇలా మృతి చెందుతాడని అనుకూలదని బంధువులు బోరున విలపించారు. తదుపరి పోలీసులు తమ సంతాపాన్ని తెలియజేశారు.