విశాలాంధ్ర – ధర్మవరం:: నూతన ఆర్డీవో వెంకట శివరాంరెడ్డి కు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తాలూకా.. జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు తిరుపాల్ తాలూకా అధ్యక్షులు సాయి ప్రకాష్ కోశాధికారి వరప్రసాద్ తోపాటు దీప తదితరులు పుష్పగుష్పం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఆర్డిఓకు విన్నవించారు. ఆర్డీవో మాట్లాడుతూ ఉద్యోగుల సంఘం సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.