బత్తలపల్లి : ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ధర్మవరం అసెంబ్లీ కన్వీనర్ గా మహమ్మద్ సలీం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గోగుల మూర్తి పేర్కొన్నారు. బుధవారం అయిన మాట్లాడుతూ పట్టణానికి చెందిన మహమ్మద్ సలీం ముందు నుంచి అణగారి వర్గాల కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఆయన సేవలు గుర్తించి బుధవారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఐఎంఎం భాష, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసగానపల్లి కుల్లాయప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు ఆలమూరు రాములు సమావేశంలో ప్రకటించారన్నారు. మంజుల హరి, డేరంగుల నగేష్, మంజుల బాబు, రాజేష్ మారుతి ప్రసాద్, రాజు, తదితరులు పాల్గొన్నారు.