. 8 స్థానాలకే వైసీపీ పరిమితం
. తెలంగాణలో కాంగ్రెస్ హవా
. 10 లోక్సభ సీట్లలో గెలుపు అవకాశాలు
. మూడిరటికి బీఆర్ఎస్ కట్టడి
. ఇండియా టుడే సర్వే
న్యూదిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ ప్రజల నాడిని పసిగట్టేందుకు ఇండియా టుడే ఓ ప్రయత్నం చేసింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట సర్వేను దేశవ్యాప్తంగా జరిపించింది. దీంతో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నది అంచనా వేసే ప్రయత్నం చేసింది. ఇండియా కూటమికి అనేక రాష్ట్రాల్లో అనుకూల పవానాలు వీస్తున్నాయని, తమిళనాడును క్లీన్స్వీప్ చేయొచ్చు అని తేల్చింది. మహారాష్ట్రలోనూ ఇండియా కూటమికి మంచి అవకాశాలు ఉన్నాయని, ఎన్డీయే కూడా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బలంగా ఉన్నట్లు పేర్కొంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి షాక్ ఇస్తూ ప్రతిపక్ష టీడీపీకి 17 ఎంపీ స్థానాలు వరిస్థాయని సర్వే వెల్లడిరచింది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 17 లోక్సభ స్థానాలు గెలుచుకోబోతోందని, వైసీపీ ఎనిమిది స్థానాలకు పరిమితం కానుందని ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడైంది. 2023, డిసెంబర్ 15 నుంచి జనవరి 28 వరకు సర్వే జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 22 లోక్సభ స్థానాలను గెలుచుకోగా టీడీపీ మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. కానీ ఈసారి 45 శాతం ఓట్లు టీడీపీకి వస్తాయని పేర్కొంది. అదే విధంగా తెలంగాణలో ఇండియా కూటమి రాణించగలదని అంచనా వేసింది. రాష్ట్రంలోని 17కుగాను 10 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని, బీఆర్ఎస్ 3, ఏఐఎంఐఎంకు ఒకటి చొప్పున వరిస్తాయని తెలిపింది. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్కు 9, బీజేపీకి 4, కాంగ్రెస్కు 3, మజ్లిస్కు ఒక సీటు వచ్చిన విషయం తెలిసిందే.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాణించింది. ఇదే ఒరవడి కొనసాగితే 10 లోక్సభ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరవచ్చని సర్వే అంచనా వేసింది.