అభినందనలు తెలిపిన గ్రామ ప్రజలు
విశాలాంధ్ర – పామిడి (అనంతపురం జిల్లా) : నియోజకవర్గ పరిధిలో గురుబాడు గ్రామానికి చెందిన దళిత రామాంజనేయులు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు, ఇటీవల బ్రెయిన్ స్టాక్ తో మృతి చెందాడు, విషయం తెలుసుకున్న గుంతకల్లు నియోజకవర్గం శాసన సభ్యులు వై.వెంకటరామిరెడ్డి ఉపాధి హామీ పి డి తో మాట్లాడి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించారు అంతేకాకుండా ప్రభుత్వం నుండి అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు, అందులో భాగంగా మృతుడు భార్య దళిత మహాలక్ష్మి కి గుర్రబాడు గ్రామం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా నియమిస్తున్నట్లు తెలియజేస్తూ ఆమెకు జాయినింగ్ లెటర్,5 లక్షల రూపాయలు చెక్కు ఆమెకి అందజేశాడు, అందుకు గుర్రబాడు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి కి అభినందనలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.