విశాలాంధ్ర – ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా మొదటి ఏపీ చేనేత కార్మిక సంఘం మహాసభ సోమందేపల్లి లోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభా కార్యక్రమానికి విచ్చేసిన పలువురు చేనేత సమస్యలపై తీసుకోవలసిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి నాగ స్వామి, పిల్లలమర్రి నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ సమక్షంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులుగా పోలా లక్ష్మీనారాయణ, విజయ భాస్కర్, చెట్ట రవి వర్ధన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బుడుగ వెంకట నారాయణ, గౌరవాధ్యక్షులుగా వెంకటస్వామి, సహాయ కార్యదర్శులుగా చెన్నంపల్లి శ్రీనివాసులు శ్రీ కేశవ కోశాధికారిగా మల్లికార్జున తో పాటు 25 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఎంపికైన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన కమిటీ వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న చేనేత పరిశ్రమను కాపాడుకుంటూ, చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు సల్ఫీ, చేనేత అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు.