విశాలాంధ్ర, సీతానగరం:సీతానగరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా పెంట సత్యంనాయుడు (రామవరం), ప్రధానకార్యదర్శిగా రౌతు వేణుగోపాలనాయుడు (సుమిత్రపురం) లను ఏకగ్రీవంగా నియమించినట్లు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి బోనెల విజయ్ చంద్ర తెలిపారు.శనివారంనాడు పార్వతీపురం పార్టీకార్యాలయంలో నిర్వహించిన సీతానగరం పార్టీనేతల సర్వసభ్యసమావేశంలో నూతనకమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఇంచార్జి విజయ్ చంద్ర తెలిపారు. వారిద్దరుతోపాటు ఉపాధ్యక్షులుగా సబ్బాన శ్రీనివాసరావు(అప్పయ్యపేట), వాకాడ పారినాయుడు(చెల్లంనాయుడువలస), అధికార ప్రతినిధిగా సోమిరెడ్డి రమేష్(తామరఖండి),పార్టీకార్యాలయం కార్యదర్శిగా రెడ్డి సింహాచలంనాయుడు(ఆర్ వెంకంపేట) లను నియమించడం జరిగిందని తెలిపారు. ఇంచార్జి విజయ్ చంద్ర ప్రకటన చేసిన నూతనకమిటీని మండలంలోని టీడీపీ నాయకులంతా ఆమోదం తెలిపారని ఆయన అన్నారు. నూతన కమిటీనాయకులను మండలంలోని టీడీపీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి అభినందించారు. తమకుఅప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ రానున్నసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయంకోసం నిరంతరం కష్టపడి పనిచేస్తామని తెలిపారు.పార్వతీపురం, బొబ్బిలి నియోజకవర్గ ఇంచార్జిల ఆదేశాలు,సూచనలు, సలహాలను పాటిస్తూ టీడీపీ పార్టీబలోపేతం చేయడానికి, ఎన్నికల్లో గెలుపుకోసం కష్టపడి పనిచేస్తామని తెలిపారు.