చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.10.02.2024ది. నియోజకవర్గ ప్రజలందరికీ 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ ను అందించడమే అధికార వై.సి.పి. ప్రభుత్వ లక్ష్యమని చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మ శ్రీ మాట్లాడుతూ సుమారు 50 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో అవసరమైన చోట విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జగనన్న కాలనీ కు విద్యుత్ లైన్లు హుటాహుటిన ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కొత్తగా 133/11 కె.వి. సబ్ స్టేషన్లు, అంకుపాలెంలో విద్యుత్ డివిజనల్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. 2019 లో అధికారం చేపట్టిన తరువాత అన్ని ప్రభుత్వ శాఖల తో నిర్వహించిన సమీక్షా సమావేశాలు లో, లోటుపాట్లు గుర్తించి అధికార వై.సి.పి. ప్రభుత్వంలో సి.ఎం.జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డి.ఈ. రామకృష్ణ, ఎ.డి.ఈ లు గౌరీ ప్రసాద్, అప్పలనాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడువాక సత్యారావు, ఏ.ఈ.లు ఉదయ్ కుమార్, నందన్, దొడ్డి వెంకటరావు, చందు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.