వైకాపా ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి అటకెక్కింది
తెదేపా రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ తో సూపర్ సిక్స్ పథకాల మినీ మేనిఫెస్టో రాష్ట్ర ప్రజలకు రక్షణ కవచమని రాష్ట్ర కార్యదర్శి ఎం వీ వీ ప్రసాద్ అన్నారు. ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బేరా సత్యనారాయణ ఆధ్వర్యంలో మండలంలోని అన్నవరం వారపు సంతలో గిరిజనులకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన సూపర్ 6 – మినీ మ్యానిఫెస్టోను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వైకాపా ప్రభుత్వంలో అభివృద్ధి అటకెక్కిందన్నారు. సంక్షేమం ముసుగులో ఆ పార్టీ నాయకులు దొరికినంత దోచుకున్నారన్నారు. మరో ఛాన్స్ అంటూ మళ్ళీ ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుడుముసారి మాజీ యం పి టి సి మర్రి బింగు, అన్నవరం మాజీ యం పి టి సి పొత్తురు దేవయ్య, సీనియర్ నాయకుడు వెలుసూరి సోమయ్య, తెలుగు యువత కార్యదర్శి బోనంగి మూర్తి తదితరులు పాల్గొన్నారు.