విశాలాంధ్ర- ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): రాష్ట్ర ప్రభుత్వము విద్యావ్యవస్థకు, అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు ప్రవేశ పెట్టి విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తుందని అక్కుపల్లి గోకవరం గ్రామ సర్పంచి మిద్దె సత్యవతి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం యూపీ పాఠశాలలో 30మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను సర్పంచ్ అందజేశారు. వినయ విధేయతలతో పాటు క్రమశిక్షణతో ఉన్న విద్యార్థి కరుటూరి రాజు కిరణ్ ను అభినందించారు. ప్రధానోపాధ్యాయుడు టి ఆనందరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందడుగులు వేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు దేవదాసు విజయనిర్మల, కరుటూరి చిన్న రాజా, ఉపాధ్యాయులు, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.