సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్
విశాలాంధ్ర – జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఈనెల 15న జీ మాడుగుల పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించు మెగా వాలీబాల్ టోర్నమెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని జి మాడుగుల సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సూరిమెట్ట గ్రామం లో గురువారం నిర్వహించే ఈ టోర్నమెంటు కు జి మాడుగుల మండలంలోని బోయితిలి, కిల్లం కోట, లువ్వసింగి, నుర్మతి, పెదబయలు మండలంలో లింగేటి, బొంగరం, ఇంజరి, గినెలకోట, జామిగుడా, ముంచింగి పుట్టు మండలంలో కుమడ, బూసుపుట్టు పంచాయతీ లలో ఉన్న వాలీబాల్ టీమ్స్ సంబంధిత పంచాయతీలలోనిమహిళ పోలీస్ ల వద్ద పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా జిమాడుగుల సీఐ రమేష్, ఎస్సై శ్రీనివాస్ లు తెలిపారు. గ్రామంలో వాలంటరీ ద్వారా, మహిళా పోలీసుల ద్వారా, సిఐ, ఎస్సై ల ద్వారా పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ పోటీలలో పాల్గొని మొదటి బహుమతి సాధించిన వారికి 20,000/-, రెండో బహుమతి 15,000/- మూడో బహుమతి 10,000/- మరియు ప్రతి టీముకు వాలీబాల్, నెట్ ఇవ్వడం, పాల్గొన్న ప్రతి టీమ్ కు డ్రెస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. సందేహాలు ఉన్నవారు పూర్తి వివరాలకై జి మాడుగుల సిఐ, ఎస్సై లను ఈ ఫోన్ నంబర్లలో సంప్రదించాలని 9440904222,
9440904221 సీఐ తెలిపారు.