ప్రధాన అర్చకులు విజయ్ కుమార్ శర్మ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎస్ఎల్వీ మార్కెట్ పాత బస్టాండ్ వద్ద గల శ్రీ సుబ్రహ్మణ్య నాగ దేవతల కట్ట ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు ప్రధాన అర్చకులు విజయ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే సుబ్రమణ్య నాగదేవతల ఉత్సవ విగ్రహాలను వివిధ అభిషేకాలతో పాటు పాలాభిషేకములు నిర్వహించారు. తదుపరి వివిధ పూలమాలలతో అలంకరణ చేసిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. విగ్రహాలకు భక్తాదులచే పాలాభిషేకం కూడా నిర్వహించారు. తదుపరి దాత చేతుల మీదుగా వెండి కవచ సమర్పణ కూడా నిర్వహించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ ఈ షష్టి పూజలు వేడుకలు భక్తుల నడుమ, ఆలయ కమిటీ తరఫున నిర్వహించారు. ఈ సుబ్రహ్మణ్య షష్టి పూజలు నిర్వహించడం వలన మనిషికి చక్కటి ప్రశాంతి తో పాటు కుటుంబంలో కష్టాలు తొలగి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వాలంటీర్లు, ఆలయ కమిటీ, భక్తాదులు పాల్గొన్నారు.