విశాలాంధ్ర,ఎన్ పి కుంట: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు శనివారం ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను సేవ వజ్ర, సేవా రత్న, సేవా మిత్రాలతో సన్మానించే వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్న నిర్వహించారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి హాజరై వాలంటీర్లకు నగదు బహుమతులను అందజేయడంతోపాటు, దృశ్యాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా చేపట్టినటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మన రాష్ట్రంలో చేపట్టి ప్రజాదరణ పొందారన్నారు. కనివిని ఎరుగని రీతిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేపట్టి ఈ పథకాలను గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా మరియు వాలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే చేరవేసే విధంగా ప్రణాళికాబద్ధంగా అమలుపరుస్తున్నారన్నారు. ఆనాడు ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని అమలుపరుస్తూ ప్రజా నాయకుడిగా వెలుగొందుతున్నారు. ప్రజలకు ఏమి అవసరం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది వాలంటీర్లేనని, అంతటి ప్రాముఖ్యతను జగన్మోహన్ రెడ్డి మీకు కల్పించారన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వాలంటీర్ల కు అవార్డులను వరుసగా నాలుగవ ఏడాది వాలంటీర్లకు అందజేస్తున్నామని తెలిపారు. ఈ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందజేస్తున్న జగనన్న చేపట్టబోయే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల చెంతకు చేరవేయడంలో చురుకుగా పని చేయాలని తెలుపుతూ వాలంటీర్ల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజనమ్మ, ఎం పిపి రాము, వాటర్ షెడ్ చైర్మన్ భయ్యా రెడ్డి, ఈ ఒ ఆర్ డి మనోహర్ బాబు,సచివాలయ సిబ్బంది, పెద్ద ఎత్తున వాలంటీర్లు మరియు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.