విశాలాంధ్ర- ధర్మవరం: పట్టణంలోని శ్రీనివాస నగర్ లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా అర్చకులు,ఆలయ కమిటీ, దాతలు, భక్తులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్న రు. ప్రధాన అర్చకులు రాజేష్ ఆచార్యులు స్వామివారికి తొలిత ప్రత్యేక పూజలతో పాటు పంచామృత అభిషేకం, విశేష పూలంగి సేవలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సూర్య ప్రభ వాహనంలో పట్టణ పురవీధులలో ఊరేగించారు. అనంతరం రథసప్తమి యొక్క ప్రాధాన్యతను భక్తాదులకు అర్చకులు వివరించారు. రథసప్తమి రోజున స్వామి వారిని పూజించిన వారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని చక్కటి మనశ్శాంతి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు చెన్నం శెట్టి జగదీష్, జింక రాజేంద్ర ప్రసాద్, చెన్నం శెట్టి శ్రీనివాసులు, భక్తాదులు, ఆలయ వాలంటీర్లు పాల్గొన్నారు.