ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం. ఆలయ ఈవో. వెంకటేశులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని ఈ బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం ఆలయ ఈవో వెంకటేశులు, వైస్ చైర్మన్ కుండా చౌడయ్య, భక్తాదులు, దాతలు అర్చకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడూ వాహనాలలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పట్టణ పురవీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం ఆలయ ఈవో వెంకటేశులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే విధంగా ఆ సాంప్రదాయ పద్ధతిలోనే నాడు రథసప్తమి వేడుకలను నిర్వహించడం జరిగిందని, ఇందుకు దాతలు సహకరించడం మరువలేనిదని తెలుపుతూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్ లు వేదమంత్రాలు మంగళ వాయిద్య నడుమ తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. తదుపరి ఏడు రకాల వాహనాలకు కూడా స్వామివారికి వివిధ పూలమాలలతో అలంకరించిన వైనం భక్తులను విశేషంగా ఆకట్టుకుందని వారు తెలిపారు. నాడు సూర్య ప్రభ వాహనం, శేష వాహనం, గరుడ వాహనం, హనుమత్ వాహనం, కల్పవృక్ష వాహనం, సూర్యభూపాల వాహనం, చంద్రప్రభ వాహనాలలో స్వామివారు ఆశీనులై పట్టణ పురవీధులలో ఊరేగింపును నిర్వహించామని తెలిపారు. ఈ వాహనాలకు ఉభయదాతలుగా వ్యవహరించిన దాతలు అందరిని కూడా స్వామి సన్నిధిలో వారి పేరిటన పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రథసప్తమి సందర్భంగా 5000 రూపాయల నుంచి 30 వేల రూపాయల వరకు ఇచ్చిన విరాళ దాతలకు, ప్రసాద దాతలకు కూడా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఊరేగింపు సమయంలో కేరళ కళాకారులు, కీలుగుర్రాలు విచిత్ర వేషధారణ, అన్నమాచార్య సంకీర్తనలు, చిన్నారుల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు జయలక్ష్మి, సౌందర్యలహరి, సునీత, అశ్వత్ నారాయణ, పద్మావతి, మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు