విశాలాంధ్ర- కొయ్యలగూడెం : వైఎస్ఆర్సిపి కొయ్యలగూడెం పట్టణ , మండలశాఖల సమన్వయ కర్తలుగా ఆరుగురు సభ్యులను నియమించినట్లు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. కమిటీలో వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి విష్ణు, ఎంపీపీ గంజిమల రామారావు, మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షుడు మంతెన సోమరాజు, మాజీ ఎంపీపీ మట్టా సత్తిపండు, ముప్పిడి వెంకట్రావు లను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మండల వ్యాప్తంగా పార్టీ విస్తృత కార్యక్రమాల నిర్వహణతో పాటుగా పద్దెనిమిది పంచాయతీల పరిధిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవలసిన బాధ్యత వీరిపై ఉంటుందనిఆయన పేర్కొన్నారు.