విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పిలవబడే జర్నలిస్టులపై దాడులకు పాల్పడడం అమానుషమని ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు యల్లప్ప, కార్యదర్శి బొగ్గుల తిక్కన్న విమర్శించారు. సోమవారం పెద్దకడబూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వృత్తిలో భాగంగా సమాచార కవరేజ్ కోసం వెళ్లిన అనంతపురం జిల్లా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీ కృష్ణ పై మూకుమ్మడిగా దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. పాలకులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులపై దాడులను ప్రోత్సహించడం మంచి పరిణామం కాదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫోటో గ్రాఫర్ పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.