విశాలాంధ్ర, సీతానగరం:మండల కేంద్రం లోని పెదభోగిలి మేజర్ పంచాయతీలో నూతనంగా నిర్మించిన రెండు గ్రామ సచివాలయాల భవనాలను శాసనసభ్యులు అలజంగి జోగారావు సోమవారంనాడు ప్రారంభంచేసి ప్రజలకు అంకితం చేశారు. ఆయనకు గ్రామస్తులు, నేతలు అభిమానులు మేల తాళాలతో, మందుగుండు సామగ్రితో ఘనస్వాగతం పలికారు.గాంధీజీకలలుగన్న గ్రామ స్వరాజ్య నిర్మాణం సచివాలయం వ్యవస్తతోనే సాధ్యమని నమ్మిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయం వ్యవస్తను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.గ్రామాల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు, అభివృధ్ది సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుజరిగాక గతనాలుగున్నర ఏళ్ల కాలంలో గ్రామంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా నేరుగా ప్రజలకు లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు.
ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గూర్చి సుదీర్ఘ ఉపన్యాసంద్వారా వివరించారు.రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్సార్సీపీను గెలిపించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిను రెండోసారి సీఎంగా చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న ఆరోపణలు త్రిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. నేరుగా డిబిటి ద్వారా లబ్దిదారులకు పథకాలను జమచేస్తున్న ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రతీ ఒక్కరి కష్టాలన్నీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుస్తున్న విధానాన్ని వివరించారు. సిఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్య సురక్ష కార్యక్రమం గూర్చి వివరించారు.
ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు ఎంపీపీబలగ రవనమ్మబలగశ్రీరాములు, జెడ్పీటీసీ మామిడి బాబ్జీ, మండలపార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, ఎంపిడిఓ ఎం.ఈశ్వరరావు,తహశీల్దార్ జనార్ధన రావు,సర్పంచ్ తేరేజమ్మగరికయ్య, ఎంపీటీసిలు బురిడి కుసుమకుమారి సూర్యనారాయణ, సురగాల గౌరీకిరణ్,
సహకారసంఘం అధ్యక్షుడు సాకేటి కూర్మారావు,సురేష్,రామారావు,రమేష్,
పోల ఈశ్వరనారాయణ, ఆర్వీ,ఎన్ రామకృష్ణ అల్లుతిరుపతిరావు,దనం, వెంకట రమణ,సింహాచలం, సబ్బాన ఆనంద్, తదితర నాయకులు,వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతోపాటు, ఈఓ వెంకటరావు, కార్యదర్శి సుధారాణి,సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు, పెదబోగిలి, అప్పయ్య పేట,సీతానగరం, బుడ్డిపేట ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎస్ఐ ఎం రాజేష్ ఆద్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.