ముంబయి: పీఎన్బీ మెట్లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ విభాగంలో కొత్త ఫండ్ అయిన పీఎంఎల్ఐ స్మాల్ క్యాప్ ఫండ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కొత్త ఫండ్ పాలసీ హోల్డర్లకు స్మాల్ క్యాప్ కంపెనీలపై దృష్టి సారించి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫోర్ట్పోలియోలో పెట్టుబడి పెట్టడం ద్వారా పాలసీ జీవితంలో సంపదను సృష్టించే అవకాశాన్ని అందిస్తుంది. కొత్త ఫండ్ 19 ఫిబ్రవరి 2024 నుండి 29 ఫిబ్రవరి వరకు ఎన్ఎఫ్ఓ వ్యవధిలో యూనిట్ ధర రూ.10కి అందుబాటులో ఉంటుంది. పీఎన్బీ మెట్లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ వివిధ రంగాల్లో అధిక వృద్ధి సామర్థ్యం కలిగిన చిన్న పరిమాణ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ వృద్ధిలో భాగమయ్యే అవకాశాన్ని పెట్టుబడిదారులకు అందిస్తుందని పీఎన్బీ మెట్లైఫ్ చీఫ్ ఇన్వెస్టిమెంట్ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు.