ఛాంపెయిన్ కౌంటీ కరోనెర్ స్టీఫెన్ థునే ధృవీకరణ
స్ప్రింగ్ ఫీల్డ్: అమెరికా, ఇల్లినాయిస్ యూనివర్సిటీ విద్యార్థి, భారత సంతతికి చెందిన అకుల్ బి. ధావన్ గతనెలలో మరణించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలు తెలుపుతూ ఈనెల 20న ఛాంపెయిన్ కౌంటీ కరోనెర్ స్టీఫెన్ థునే ఒక ప్రకటన విడుదల చేశారు. అకుల్ ప్రమాదవశాత్తు మరణించలేదని తేల్చింది. జనవరి 23న జరిపిన పోస్టుమార్టం అనంతరం హైపోథెర్మియాతో అకుల్ ధావన్ మరణించినట్లు రుజువు అయ్యిందని పేర్కొంది. అధికంగా మద్యాన్ని సేవించడానికి తోడు గట్టకట్టే చలిలో చాలా సేపు ఉండటం వల్ల అతను ప్రాణాలు కోల్పోయినట్లు స్టీఫెన్ ధునే ప్రకటన పేర్కొంది. జనవరి 20న అకుల్ తన మిత్రులతో కలిసి క్యాంపస్కు సమీపంలోని కెనోపి క్లబ్కు వెళ్లాడు. అక్కడి సిబ్బంది లోపలికి వెళ్లనివ్వలేదు. ఎంతకీ అనుమతించకపోవడంతో అకుల్ నిరాశ చెందాడు. చివరకు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మిత్రులు ఎంత ప్రయత్నించినా అతని ఆచూకీ లభించలేదు. ఫోన్లకు అందలేదు. సంక్షిప్త సందేశాలకూ స్పందించలేదు. ఫోన్ అందుబాటులో లేకుండా పోయింది. దీంతో కంగారు పడ్డ అతని స్నేహితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు గాలింపులు చేపట్టారు. అర్థరాత్రి 1.23 గంటల నుంచి అకుల్ ఆచూకీ లేనట్లు గుర్తించారు. అనంతరం కొన్ని గంటల తర్వాత మృతదేహం లభ్యమైంది. హైపోథెర్మియా లక్షణాలను గుర్తించారు.