మహిళా కార్మికుల ప్రాణాలతో చలగాటమాడుతున్న టెక్సపోర్ట్,…
విశాలాంధ్ర చిలమత్తూర్ రూరల్ : మండల పరిధిలోని టెక్సపోర్ట్ కంపెనీలో పని చేస్తున్న మహిళా కార్మికులతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు వారి ప్రాణాలతో చలగాటమాడుతున్న టెక్సపోర్ట్ యాజమాన్యం
వివరాల్లోకెళితే ఆ సంస్థలో పనిచేస్తున్న మహిళా కార్మికులు సుదూర ప్రాంతాల నుంచి బ్రతుకుతెరువు కోసం పెద్ద ఎత్తున హాజరవుతున్నారు ఇందుకోసం అనుమతులు లేని ఎన్నో వాహనాలైన ఆటోలు బస్సులు ఏర్పాటు చేసుకున్నారు అయితే పరిమితికి మించి కార్మికులను ఎక్కించుకొని ఇష్టారాజ్యముగా వాహనాల నడుపుతూ సొమ్ము చేసుకుంటున్న విధానం విధితమే దీంతో ఆ వాహనాల్లో ప్రయాణించే కార్మికులు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణిస్తున్నారని తెలిసింది అంతేకాక పలుమార్లు వాహనాలు ప్రమాదాలు గురై ప్రాణాల మీదికి వచ్చిన సంఘటనలు కూడా లేకపోలేదు, అంతేకాక ప్రమాదంలో గాయపడిన వారికి నష్టపరహారం కూడా చెల్లించలేక పోయింది యాజమాన్యం, ఇకపోతే గోరంట్ల వైపు నుంచి వచ్చే బస్సు పరిమితకు మించి కార్మికుల నెక్కించుకొని వస్తు ప్రయాణాలను సాగిస్తున్నది ఆ వాహనానికి జరగరానిది జరిగితే వారి పరిస్థితి ఏంటో అంటూ మండల ప్రజలు, తోటి కార్మికులు వాపోతున్నారు యాజమాన్యం ఈ విషయంపై చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంలో అంతరిమేంటోనని అర్థం కాలేకపోతున్నదని నిపుణులు చర్చించుకుంటున్నారు, ఇది ఇలాగే కొన సాగితే కార్మికులు హాజరుకామని చెప్పినట్లు కూడా సమాచారం, ఇలా ప్రయాణాలు సాగిస్తున్న వేళ అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని ప్రాణాలు కూడా పోగొట్టుకున్న సంఘటనలు, పలువురి కుటుంబాలు రోడ్డున పడిన స్థితిగతులు లేకపోలేదు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి టెక్సపోర్ట్ యాజమాన్యానికి వచ్చి వెళ్తున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ అనుమతులు లేని వాహనాలను సీజ్ చేసి ప్రయాణంలో పరిమితంగా ఎక్కించుకొని కార్మికులకు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాహనాలకు అనుమతులు కల్పించిన యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకొని శిక్షించాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.