విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఎనస్తీసియా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా గిరిజన ప్రాంతానికి చెందిన వైద్యుడు కిల్లో రమేష్ కు అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విజయవాడ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. గిరిజన బిడ్డగా నేషనల్ ఇనిస్టిట్యూట్ జీప్ మార్ పాండిచ్చేరి లో ఎం డి ఎనస్థీషియా చదువు కున్న ఆయన చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో ఎనస్తీసియా (మత్తు) వైద్యాధికారిగా కొన్నాళ్లు విధులు నిర్వహించారు. గిరిజన ప్రాంత స్థితిగతులు, గిరిజనుల ఆరోగ్య పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న ఆయన కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఎనస్తీసియా (మత్తు) అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులు కావడం మన్యప్రాంత ప్రజలకు వరంగా మారుతుందని ఈ ప్రాంతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో గిరిజన సమాజానికి మత్తు వైద్యాధికారిగా ఆయన సేవలు ఉపయోగపడే విధంగా ఉంటాయని గిరిజన సమాజం భావిస్తుంది.