బాలల సంరక్షణ అధికారి మహేష్
విశాలాంద్ర – ధర్మవరం:: అనాధలతోపాటు బడి మానేసిన పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడమే మా లక్ష్యము అని జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్, బాలల సంరక్షణ అధికారులు మురళీధర్, నాగలక్ష్మి,, సిడిపిఓ లక్ష్మి, మహిళా సంరక్షణ కార్యదర్శి ఉష పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణములోని లక్ష్మీ చెన్నకేశవపురం,మహాత్మా గాంధీ కాలనీలలో అధికారులు పర్యటించి, బడి మానేసిన పిల్లలు, భిక్షాటన చేస్తున్న పిల్లలు, వలసలకు వెళుతూ పిల్లలను నిర్లక్ష్యానికి గురి చేస్తున్న వారి కుటుంబ సభ్యులతో సచివాలయంలో సమావేశంలో నిర్వహించారు. తదుపరి అర్హత కలిగిన అమ్మాయిలను గుర్తించి అనంతపురం బాల సదస్సుకు పంపించారు. కుటుంబ ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేని చిన్నారులను తిరిగి పాఠశాలలో చేర్పించేలా చర్యలు చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ ఆనందు, వాలంటరీలు, అంగన్వాడి టీచర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.