ఆర్యవైశ్య సంఘం
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మూలవిరాటును ప్రతిష్టించి 22 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కలవల మురళీధర్ తో పాటు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులచే వాసవి మాతకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. తొలుత వాసవి మాతకు అర్చకులు ప్రత్యేక పూజలను వనర్చారు. అనంతరం కలవల మురళీధర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులదైవం వాసవి మాత ను నమ్ముకున్న వారికి కష్టాలు తొలగి, సుఖవంతమైన జీవితంలో లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కులదైవమును వారి వారి అనుకూలాలని బట్టి ప్రతి కుటుంబంలో పూజించే అలవాటును చేసుకోవాలని తెలిపారు. తదుపరి ఆలయములో జరిగే ప్రతి కార్యక్రమంలో ఆర్యవైశ్య భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. దైవ ఆశీస్సులు ఉంటేనే మానవుడు తలుచుకున్న ప్రతి సమస్య పరిష్కారమై విజయవంతం చేకూర్చుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్థలు, వందలాదిమంది ఆర్యవైశ్య కుల బాంధవులు పాల్గొన్నారు.