బి.ఎస్ మక్బూల్
విశాలాంధ్ర,కదిరి:(శ్రీ సత్య సాయి జిల్లా) : రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ఎప్పటికప్పుడు వివిధ సామాజిక ప్రసార మాధ్యమాలలో ప్రచారం చేసే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఉండి వారికి తోడుగా నిలబడతానని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్నపై అభిమానంతో నిస్వార్ధంగా పని చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కవచాలే సోషల్ మీడియా కార్యకర్తలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన వార్తపత్రికలు రాస్తున్న అసత్య కథనాలను తిప్పికొట్టే ప్రతి ఒక్క సైనికుడికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించిన సోషల్ మీడియాకు వైఎస్ఆర్సిపిలో అధిక ప్రాధాన్యత ఇస్తామని
జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి సోషల్ మీడియా సహకారం చాలా అవసరం కావున ఎక్కువ సంఖ్యలో సందేశాలను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయాలని వారికి తెలియచేసారు.ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగానే నియోజకవర్గంలోని
యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తనదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ
అధ్యక్షులు జిలాన్ భాష, వైసి పి నాయకులు పరికి సాధిక్ భాష, నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు.